Header Banner

తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లండి! వారికి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు!

  Sun Apr 27, 2025 21:50        Politics

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది. పకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఈ ఉగ్రదాడిని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఉంటున్న పాకిస్థానియులు అందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తమ ప్రాంతంలో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి వాళ్లను రాష్ట్రం నుంచి పంపేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. రాష్ట్రంలోని పాకిస్థాన్‌ జాతీయులు తక్షణమే రాష్ట్రాన్ని విడిచి వెళ్లేలా చర్యలు చేపట్టాలని పోలీసులకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సమీక్ష నిర్వహించిన డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా రాష్ట్రంలో ఎక్కడ పాకిస్థానీయులు ఉన్నా తక్షణమే వారిని దేశం నుంచి పంపించేయాలని జిల్లాల ఎస్పీలను, పోలీస్‌ కమిషనర్లను ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: జీవీఎంసీ మేయర్ ఎన్నికలలో సంచలనం! టీడీపీ మేయర్ అభ్యర్థిగా ఆయన ఖరారు!

 

 

డీజీపీ ఆదేశాలతో రాష్ట్రంలో 21 మంది పాకిస్థాన్ దేశస్తులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో 15 మంది ఇవాళ సాయంత్రంలోపు దేశం విడిచి వెళ్తామని చెప్పగా, మరో ఏడుగురు వైద్య సేవల నిమిత్తం మెడికల్‌ వీసాలతో వచ్చిన వారు కావడంతో వారికి ఈనెల 29 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత దేశం విడిచి పాకిస్థాన్‌కు వెళ్లిపోతామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పాకిస్థానీ పౌరుల వివరాలను సేకరించిన పోలీసులు డిపార్ట్మెంట్ ఆదేశాల ప్రకారం వారిని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. వారి ప్రయాణానికి అవసరమైన భద్రతా ఏర్పాట్లను కూడా ముమ్మరం చేశారు. రాష్ట్రం అంతటా ఉన్న పాకిస్థానీ పౌరులపై ప్రత్యేక నిఘా పెంచి, ఎలాంటి అనూహ్య ఘటనలు జరగకుండా చూస్తున్నారు. అలాగే కొత్తగా రాష్ట్రానికి ఎవరు వస్తున్నా, వారి వీసా వివరాలను పరిశీలించి, అనుమతులు జారీ చేసే విధానాన్ని కఠినతరం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు భద్రతా పరిస్థితిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంతేకాక, విదేశీ పౌరులపై ముఖ్యంగా పాక్ పౌరులపై ప్రభుత్వ నిఘా కొనసాగుతుందని తెలిపారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఈఎన్సీ ఇంట్లో ఏసీబీ సోదాలు! కీలక పత్రాలు స్వాధీనం! వేల కోట్ల అవినీతి గుట్టురట్టు!

 

చంద్రబాబు కీలక నిర్ణయం! ప్రభుత్వ కళాశాలల్లో కొత్త నియామకాలు!

 

 వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

హెచ్-1బీ ఆశావహులకు అమెరికా షాక్! ఇకనుండి అవి తప్పనిసరి!

 

కేంద్ర నిఘా సంస్థ పేరుతో వదంతులు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ డీజీపీ

 

పోలవరంపై రీసర్వే నిర్వహించాలి.. షర్మిల కీలక వ్యాఖ్యలు!

 

గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. బార్ల లైసెన్స్ ఫీజు, నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గింపు..

 

వైసీపీ బాగోతం! అధికారంలో బెదిరింపులు.. బయటపడ్డాక బెయిల్ పిటీషన్లు!

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారాలు! స్కూటీ స్వాధీనం! వారిద్దరు నిందితులుగా గుర్తింపు!

 

అర్ధరాత్రి భారత జవాన్లపై పాక్ కాల్పులు! కాశ్మీర్ ఎల్ఓసీ పొడవునా..

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త పెన్షన్లకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APGovernment #PakistaniNationals #AndhraPradesh #SecurityMeasures #ImportantOrders #DGPOrders